మృత్యువాత పడ్డ ఆర్మీ జాగిలం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
ఇండియన్ ఆర్మీకి చెందిన జాగిలం ‘జూమ్’ రెండు రోజుల క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తన శరీరంలో 2 బులెట్లు ఉన్నా.. ఉగ్రవాదులు హతం అయ్యేవరకూ వారిని పట్టుకొని ఉండి ఔరా అనిపించింది. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ‘జూమ్’ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వీరమరణం పొందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ‘జూమ్’కు నివాళులర్పిస్తూ.. జైహింద్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.