రికార్డులు తిరగ రాసిన రోహిత్ శర్మ
నిన్న సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి. నవంబర్ 2021 నుంచి ఇప్పటివరకు హిట్ మ్యాన్ 26 టీ20లకు కెప్టెన్సీ వహిస్తే 21 మ్యాచుల్లో భారత్ గెలిచింది. వరుసగా 11 ద్వైపాక్షిక సిరీస్లు గెలిచింది. ఒక్కటి కూడా ఓడిపోలేదు. భారత సారథిగా ఇవే అత్యధిక వరుస విజయాలు కావడం విశేషం.