Adani group: పదేళ్లలో అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి: గౌతమ్ అదానీ
దిల్లీ: రాబోయే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుందని ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. న్యూ ఎనర్జీ, డిజిటల్ స్పేస్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. మొత్తం పెట్టుబడిలో 70 శాతం ఎనర్జీ రంగంలోనే పెట్టనున్నట్లు తెలిపారు. సింగపూర్లో జరిగిన గ్లోబల్ సీఈఓ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యాపార ప్రణాళికను వెల్లడించారు.