SCR: దసరా సందర్భంగా రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు: దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ఓ ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 9వ వరకు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.