తిరుమల తిరుపతి దేవస్థానానికి 10 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేఘా ఇంజినీరింగ్ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) గ్రూప్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజిఎల్ )పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేయనుంది.సామాన్యులకు నాణ్యమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో భక్తుల కోసం ఈ బస్సులను తిరుమల కొండపైన నడపనున్నారు. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే వీ ప్రదీప్ శుక్రవారం టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తో తిరుమల లోని అన్నమయ్య భవన్ లో సమావేశమయ్యారు.ఎం ఈ ఐ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి వీ కృష్ణా రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కు పది విద్యుత్ బస్సులను అందించేందుకు ఆశక్తిని కనపరుస్తూ రాసిన లేఖను టీటీడీ చైర్మన్ కు  అంద చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పది బస్సులను టీటీడీకి అందిస్తామని ప్రదీప్ తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కంపెనీకి ఉన్నాయనిఅందుకే గత 32 సంవత్సరాలుగా కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూనే ఉందని వెల్లడించారు.తొమ్మిది మీటర్ల పొడవు ఉండే ఈ ఎయిర్ కండీషన్డ్ బస్సులో డ్రైవర్‌తో కలిపి 36 సీట్లు ఉంటాయి. ఎలక్ట్రానిక్‌గా కంట్రోల్ చేసే ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యం ఉంటుంది. సీసీటీవీ కెమెరాలుఎమర్జెన్సీ బటన్ప్రతీ సీటుకు యూఎస్‌బీ సాకెట్ ఉంటుంది. లీథియం ఐయాన్ బ్యాటరీలు ఉన్న ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్ప్యాసింజర్‌ లోడ్‌లను బట్టి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. హైపవర్‌ ఏసీడీసీ చార్జింగ్‌ సిస్టమ్‌ వల్ల బ్యాటరీ కేవలం మూడు గంటల్లోనే చార్జ్ అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.