1000 కోట్లతో నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం

.. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ : తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 1000 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఆవరణలో లబ్ధిదారులకు చెక్కులు, నగదును స్థానిక ప్రజాప్రతినితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటికే పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తీసుకువచ్చామన్నారు. వీటిలో ఇప్పటికే 7వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. మిగిలిన ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంత మంచి చేస్తున్న కొంతమంది అనవసరమైన విమర్శలు చేస్తున్నారని వాటిని పట్టించుకోనన్నారు. బీర్కూరు మండలానికి ఈ విడత 5.92 కోట్లు విడుదల అయ్యాయని పండగ పూట అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఆయా మండలాలు తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ రాజా గౌడ్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.