దేశంలో కొత్తగా 10,542 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో కొత్తగా 10,542 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 63,562 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,190 మంది మరణించారు. గత 24 గంటల్లో 8175 మంది కోలుకోగా, కొత్తగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,27,758) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

 

Leave A Reply

Your email address will not be published.