నేడే 10 వ తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించి, ఫలితాల విడుదలకు ఆమోదం తెలిపారు.
విద్యార్థులు ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org తో పాటు www.ntnews. com వెబ్సైట్లలో చూడవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.