గాంధీభవన్ లో 138వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిధి: భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ పార్టీ జెండా ను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, సేవదల్ చీఫ్ ప్రసాద్, గడ్డం వినోద్, రామచంద్రారెడ్డి, వినోద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, రోహిన్ రెడ్డి, సమీర్ ఉల్లా, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు మెట్టు సాయి, నూతి శ్రీకాంత్, సునీతా రావ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.