తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:
నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 21,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది దీంతో 4 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని మాంజీరా లోకి విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. మంజీరా పరిసరాలలోని పంట పొలాలకు వెళ్లే రైతులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో నీటి ప్రవాహంలోకి దిగరాదని వారు సూచించారు.