తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కు చెందిన ఆకాష్ అనే విద్యార్థి నెల్లూరు నగరం లో అదృశ్యమయ్యాడు. లక్ష్మి పురం,కువ్వకొలి వరదాయ పాలెం మండలం కు చెందిన కుక్కల ఆకాష్ అనే 16 సంవత్సరాల విద్యార్థి నెల్లూరు ధనలక్ష్మి పురం నారాయణ కాలేజీ లో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి కాలేజీ కి సెలవులు ఇచ్చిన కారణం గా సొంత వూరు వెళ్ళి తిరిగి కాలేజీ కి వెళుతున్న అని చెప్పి ఇంటి ఈనెల 13 న బయలుదేరి రైలు లో నెల్లూరు వస్తూ సౌత్ స్టేషన్ వద్ద దిగి ఒక ఆటోలో ఆటో డ్రైవర్ వద్ద ఫోన్ తీసుకుని తన తండ్రికి కాల్ చేసి కాలేజీ కి వెళుతున్న అని చెప్పినాడు. శుక్రవారం ఆకాష్ తండ్రి కాలేజీ కి ఫోన్ చేసి మా అబ్బాయికి ఫోన్ ఇవ్వ వలిసిందని కోరగా మీ అబ్బాయి కాలేజీ కి రాలేదు అని సిబ్బంది చెప్పడం తో ఆకాష్ తల్లి తండ్రులు ఆందోళన చెంది నెల్లూరు చేరుకుని 1వ పట్టణ పోలీసు స్టేషన్ లో పిల్ల వాడు కనిపించలేదని పిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పిల్లాడి ఆచూకీ కోసం జిల్లా ఎస్పీ CH విజయ రావు ఆదేశాలు మేరకు,నగర DSP సూచనల తో వన్ టౌన్ CI సురేంద్ర బాబు,SI సైదులు కానిస్టేబుల్ కిరణ్ దర్యాప్తు చేపట్టి క్షేత్ర స్థాయి దర్యాప్తు, సాక్షులు, సి సి ఫుటేజి ల ఆధారంగా గంటల్లోనే పిల్లాడి ఆచూకీ తమిళనాడు రాష్ట్రం లోని రెడ్ హిల్స్ వద్ద వున్నట్టు గుర్తించి పిల్లాడిని క్షేమంగా తీసుకు వచ్చారు. పిల్లాడి ఆచూకీ గంటల వ్యవధిలో కనుగొని తమకు అప్పచెప్పేలా చేసిన నెల్లూరు జిల్లా ఎస్పి CH విజయరావు కు జిల్లా పోలిసు అధికారులకు ఆకాష్ తల్లి తండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్వరం స్పందించిన 1టవున్ అధికారులకు జిల్లా ఎస్పీ విజయరావు అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.