స్టేట్ బ్యాంక్ లో 1673 పీఓ ఉద్యోగాలు

.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : ఎస్ బి ఐ  భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1673 పీఓ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు గాను ఇందులో రెగ్యులర్ పోస్టులు 1600 ఉండగా బ్యాక్‌లాగ్ పోస్టులు మరో 73 వరకు ఉన్నాయి. విద్యార్హతలు: ఈ ఉద్యోగాలకు విద్యార్హతను డిగ్రీగా నిర్ణయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ విద్యార్హత పొందిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు ఏప్రిల్ 1, 2022 నాటికి 21-30 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ముఖ్యమైన తేదీలు: ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 22న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఆఖరి తేదీగా అక్టోబర్ 12ను నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రక్రియ: 22.09.2022 నుంచి 12.10.2022,
అప్లికేషన్ ఫీజు చెల్లింపు: 22.09.2022 నుంచి 12.10.2022
, ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్ లోడ్: డిసెంబర్ 2వ వారం నుంచి..
ఫేజ్-I: ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: డిసెంబర్ 17,18, 19, 20.

Leave A Reply

Your email address will not be published.