వంద పడకల ఆసుపత్రికి 17.5 కోట్లు మంజూరు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: చేవెళ్ల ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డయాలసిస్ వార్డులో జరిగిన సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా డయాలసిస్ వార్డును పరిశీలించారు. సమస్య పరిష్కరించి డయాలసిస్ వార్డులో వైద్యసేవలు కొనసాగుతున్నాయని వైద్యులు ఎమ్మెల్యే కు చెప్పారు.

ఆస్ప‌త్రిలోని ఇతర వార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల ఆస్ప‌త్రి వంద పడకల కోసం రూ.17.5కోట్ల నిధులు మంజూర‌య్యాయ‌ని ఎమ్మెల్యే చెప్పారు. చేవెళ్లలోని అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.