19 ఫిబ్రవరి చత్రపతి శివాజీ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ ఫిబ్రవరి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి 19 ఫిబ్రవరి ని జాతీయ సెలవు దినం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి శివసేన పార్టీ డిమాండ్ చేసింది.కాచిగూడ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది 19 ఫిబ్రవరి నాడు జయంతి ఉత్సవాలు కాబట్టి నేటి నుంచి ప్రారంభించాము పీఎం మోడీ జి వెంటనే శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మరియు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మరియు తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారిగా నిర్వహించాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు గొప్పగా చాటి చెప్పిన ఆదర్శంగా నిలిచిన భారతమాత సేవకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి 19 ఫిబ్రవరి జాతీయ సెలవు దినముగా ప్రకటించాలని శివసేన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ , యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌట్ గణేష్ లు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో అనరావు నాగనాథ్ చంద్రకాంత్ ప్రతాపరెడ్డి అవినాష్ బాలాజీ త్రిభుంగక్ కాబ్రా మధుకర్ మహాదేవ్ మారుతీ కిషన్ సచిన్ లక్సమాన్ తదితరులు పాల్గొన్నారు