బీజేపీ ఆపరేషన్ లో 20 మంది కాంగ్రెస్ నేతలు ?
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ ఆపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను చావుదెబ్బతీసిన కమలదళం.. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ నే బలిపశువుగా చేయాలని చూస్తోంది. బీజేపీ ముఖ్యనేతలతో పలువురు కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. వీరిలో మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్థాయిల నేతలు దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇతర ముఖ్యనేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు సాగించినట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నాయకులకు దగ్గరగా ఉన్నవారు వారి అనుచరులు ఈటలతోపాటు ఆయన నివాసంలో భేటి అయ్యి సంబంధిత నాయకులతో ఫోన్లో మాట్లాడించినట్టు సమాచారం.బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పలువురు కాంగ్రెస్ నేతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగిన మాజీ మంత్రులు డీకే అరుణ మర్రిశశిధర్ రెడ్డి కూడా చేరికలపై హస్తం పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం.బీజేపీ నేతలు డీకే అరుణ రాజగోపాల్ రెడ్డిలతో కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడి ఎలాగూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో చేరుతారు కాబట్టి అతడితోటి కాంగ్రెస్ సీనియర్స్ కూడా చేర్పించాలని చూస్తున్నారు. ఆలోపు కాంగ్రెస్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయాలని చూస్తున్నారంట..ఓవైపు కేసీఆర్ ఎత్తులు.. మరోవైపు బీజేపీ చిత్తులు.. ఈ రెండింటి రాజకీయ సంగ్రామానికి మధ్యలో కాంగ్రెస్ నలిగిపోతోంది. వాళ్లిద్దరూ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. బలహీన పరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచే నేతలను లాగుతున్నారు. కొందరినీ కోవర్టులుగా మార్చి రాజకీయంగావాడుకుంటున్నారు.బీజే