బొలెరో వాహనం బోల్తా 25 మందికి గాయాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరులో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ప్రమాద సమయంలో వాహనంలో 45 మంది ఉన్నారని తెలిపారు. ఓవర్‌ లోడ్‌, మితిమీరిన వేగం కారణంగా ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. బాధితులు మహాసముద్రం, కోడేరు గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.