25న హైదరాబాద్ హోటల్ ది పార్క్ లో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సికింద్రాబాద్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈనెల 25న హైదరాబాదులోని రాజ్ భవన్ రోడ్ లో గల హోటల్ ది పార్క్ లో  ‘పరిచయం మా వంతు.. పరిశీలన మీ వంతు’ పేరుతో ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య మహాసభ సికింద్రాబాద్ పట్టణ అధ్యక్షులు జగదీశ్వర్ మర్యాల తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పరిచయ వేదిక కన్వీనర్ తేలుకుంట్ల పూర్ణ చందర్రావు, కో కన్వీనర్ చల్లా ప్రకాష్, , ముత్యాల శంకర్, అల్లాడి హరీష్ కుమార్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ సత్యవరపు వీరభద్ర రావు, ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సురేష్ పాలూరి, కోశాధికారి బెజిగం శ్రీనివాసరావు లతో కలిసి మాట్లాడారు. సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ గత 20 సంవత్సరాలుగా ఆర్యవైశ్యుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ గుర్తింపు పొందారు పొందిందని వారు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ పరిచయవేదికను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రవేశ రుసుము కింద 9 900 రూపాయలను చెల్లించవలసి ఉంటుందని ఇందుకుగాను రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని ఇద్దరికీ ప్రవేశం కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం తో పాటు దేశ విదేశాల నుంచి పెళ్లి కావలసిన వధూవరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని ఆ రాష్ట్రంలోని ఆర్యవైశ్య సోదరులు సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.