కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంపు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏపెంచేశారు. ఆ ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నది. జూలై 1, 2023 నుంచి పెరిగిన డీఏ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ రేటు 42 శాతంగా ఉంది. ఒకవేళ 4 శాతం పెరిగితే, అప్పుడు అది 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.