కరోనా దెబ్బతో తో దేశంలో నిరుపేదలుగా మారిన 5.6 కోట్ల మంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి. ఉపాధి లేకపోవడంతో కనీసం తినడానికి తిండి దొరకక చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పరిశ్రమలు ఖాయిళాపడటంతో లక్షల సంఖ్యలో మంది జీవోనపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం వంటి చాలా రకాల వ్యాపారాలు మందగించిపోవడంతో రోజువారీ కూలి చేసుకునేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. దీంతో 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల 10 లక్షల మంది (71 మిలియన్లు) కడు పేదరికంలోకి జారుకున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇందులో 79 శాతం మంది భారతదేశం నుంచే ఉన్నారని పేర్కొన్నది.పావర్టీ అండ్‌ షేర్డ్‌ ప్రాస్పరిటీ 2022’ పేరుతో ప్రపంచ బ్యాంకు నివేదికను రూపొందించింది. దీనిప్రకారం 2020 చివరినాటికి కరోనా కారణంగా దేశంలో 5 కోట్ల 60 లక్షల మంది కడు పేదరికంలోకి వెళ్లారని తెలిపింది. 2019లో 8.4 శాతంగా ఉన్న పేదరికపు రేటు.. 2020 నాటికి 9.3 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. కాగాఅత్యధిక జనాభా ఉన్న దేశాల్లో పేదరిక స్థాయి పెరిగిందని చెప్పింది. అయితే ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న చైనాలో పేదల సంఖ్యలో పెద్దగా మార్పేమీ లేదని స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.