ప్రతి చేతి వృత్తుల కుటుంబానికి 5లక్షలు ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ప్రకటనను సరి చేయాలనీ ప్రతి కుల వృత్తుల కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.గత 9 సంవత్సరాల కెసిఆర్ పాలనలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో చేతి వృత్తి పనివారలు బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని వారు వాపోయారు. ఇంతకాలం బీసీల్లో కొన్ని కులాలకు మినహా చేతి వృత్తి ఆధారిత కులాలకు ఎటువంటి ఉపయుక్తమైన పథకాలు ప్రకటించకపోవడం శోచనీయమని వారున్నారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీల ఓట్లు దండుకోవడానికి తెరాస ప్రభుత్వం మరోసారి నూతన పథకాల ఆశ చూపిస్తూ మోసపూరితమైన ప్రకటనలు చేయడం సమంజసం కాదని, ఇప్పుడు కొత్తగా చేతివృత్తుల వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని కుటుంబానికి కేటాయించే లక్ష రూపాయలు ఏ కోశానా సరిపోతాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందులో136 బిసి కులాలకు గాను కేవలం 6 కులాలకే  లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం మిగతా కులాలను అవనానిన్చడమే నని పేర్కొన్నారు. చేతివృత్తులకు సంబంధించిన అధునాతన పరికరాల కొనుగోలుకు సైతం రెండు నుంచి ఐదు లక్షల వ్యయం అవుతుందని మరి ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు దేనికి సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. దళితబాందవులకు ఇచ్చినట్టుగా బీసీలకు పది లక్షలతో బీసీ బందు ప్రకటించి సత్వరమే అమలు చేయాలని, ప్రతి చేతివృత్తుల వారికి కుటుంబానికి కనీసం ఐదు లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతివృత్తులు కనుమరుగై పోతున్న తరుణంలో కుల వృత్తుల వారికి చేయూతనిచ్చి ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని కులాలకు మాత్రమే కొన్ని అభివృద్ధి పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.