తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ లోపు 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని, త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. వాటిని మెట్రో స్టేషన్కు అనుసంధానం చేస్తామని తెలిపారు.