విదేశీ జైల్లో మగ్గుతున్న 8300 మంది భారత ఖైదీలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: విదేశీ జైళ్లలో 8,300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈసౌదీ అరేబియాకువైట్‌ తదితర గల్ప్‌ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. విదేశాల్లోని భారత ఖైదీల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ చెప్పారు. ఈ ఖైదీలను విడుదల చేసిస్వదేశానికి రప్పించేందుకు అక్కడి ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.గల్ఫ్‌ దేశాలైన బహ్రెయిన్‌కువైట్‌ఒమన్‌ఖతార్‌సౌదీయూఏఈలోని జైళ్లలో 4,630 మంది భారత ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో అత్యధికంగా యూఏఈలో 1,611 మందిసౌదీలో 1461, ఖతార్‌లో 690 మంది ఖైదీలు ఉన్నట్టు పేర్కొన్నది. పొరుగుదేశమైన నేపాల్‌లో 1222 మందిపాక్‌లో 308, చైనాలో 178, బంగ్లాదేశ్‌లో 60, శ్రీలంకలో 20 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని వివరించింది

Leave A Reply

Your email address will not be published.