ఈనెల 20న బాన్సువాడకు చేరుకొనున్న రేవంత్ రెడ్డి జోడోయాత్ర

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  ఈనెల 20న బాన్సువాడ నియోజకవర్గం లో టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ జూడో యాత్ర బాన్సువాడ నియోజకవర్గం లో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం నుండి ఈ యాత్ర ప్రారంభం కానుండగా మధ్యాహ్నం ఒకటి గంటలకు దుర్గి గ్రామంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు దొరికినుండి తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది రాత్రి 7 గంటల వరకు బాన్సువాడ చేరుకొని అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ యాత్రలో దారి పొడవునా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు రేవంత్ రెడ్డికి నీరాజనాలు పలకాలని కాంగ్రెస్ శ్రేణులు కొరాయి.

Leave A Reply

Your email address will not be published.