కొవిడ్‌ విషయంలో ఆందోళన చెందవద్దు

- ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొవిడ్‌ విషయంలో ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించాలని రాష్ట్రవైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ విజృంభిస్తుందని హెచ్చరికల దరిమిలా మంత్రి అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు.కొవిడ్‌ వ్యాక్సిన్‌  తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని అదేశాలు జారీ చేశారు.రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.