నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారింది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ను బర్తరఫ్ చేయడమే కాదు.. చంచల్ గూడ జైలుకు పంపించారు. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదు? చంచల్ గూడ జైలుకు వెళ్లి కొందరు.. వారిని ఎం కౌంటర్ చేస్తామని బెదిరించి లొంగదీసుకున్నారు. అందుకే కేటీఆర్ ప్రెస్ మీట్ అయ్యాకనే వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 18 వరకు చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి అన్నారు.

కస్టడీలోకి తీసుకున్న వారిని విచారించక ముందే ఇద్దరు నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ఎలా నిర్దారిస్తారు? కేటీఆర్ ఏమైనా విచారణ అధికారా? టీఎస్ పీఎస్సీ లో పనిచేసే వారు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదు. కానీ ప్రభుత్వం పరీక్షలు  సుకోవడానికి ఎన్ఓసీ ఇచ్చింది.. నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా పోటీ పరీక్షలు రాశారు. మాధురి అమెరికా నుంచి వచ్చి గ్రూప్1 రాస్తే మొదటి ర్యాంక్ వచ్చింది జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది. కేటీఆర్ కు షాడో మంత్రి పీఏ తిరుపతి తిరుపతి, ఏ2 ముద్దాయి రాజశేఖర్ రెడ్డి ది పక్క పక్క గ్రామాలే రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం , ప్రమోషన్ ఇప్పించింది పీఏ తిరుపతి. ఇందులో ప్రత్యక్షంగా కేటీఆర్ కు ప్రమేయం ఉంది. మాల్యాల మండలంలో గ్రూప్ 1 పరీక్షల్లో వంద మందికి పైగా 103 పైగా మార్కులు వచ్చాయి వారి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి అన్నారు. టీఎస్ టీఎస్ ద్వారా రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం,ప్రమోషన్ వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ పాత్ర ఉందొ లేదో విచారణ చేపట్టాలి. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా లేదా? శ్రీ లక్ష్మీ, ప్రవీణ్,వెంకటాద్రి శ్రీదేవి, రమేష్, వాసు, మధులత లకు నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలకు అనుమతి ఇచ్చారా లేదా? అనుమతి ఇస్తే..అనుమతించిన వ్యక్తుల పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలి.  ఒక మంత్రి పేషీలో మంత్రికి తెలియకుండా ఇదంతా జరగదు. కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దింది. ఈ ఆరోపణల నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరు. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఇంత తీవ్రమైన సమస్యపై సీఎం స్పందించి నిరుద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేదు. నిరుద్యోగులపట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా? కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, ఏఆర్ శ్రీనివాస్ కు ఉన్న బంధమేంటి? రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదు. పేపర్ లీకేజీ కేసును సీబీఐ కి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులు అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తాం. 21న గవర్నర్ ను కలిసి పిర్యాదు చేసి.. తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోర తాం నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది. 30లక్షల మంది నిరుద్యోగులకు పిలుపునిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ  కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.