తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో పత్తి సరాసరి దిగుబడి తగ్గినా, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో పత్తికి మంచి ధర లభించే అవకాశం ఉన్నదిప్రస్తుతం మార్కెట్ లో క్వింటాలు పత్తి ధర సుమారు రూ.8 వేలు ఉన్నది.. అయినప్పటికీ రైతులకు మద్దతుధర (రూ.6380)కు పైగా లభించేవిధంగా మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలిప్రస్తుత ప్రపంచవ్యాప్త పరిస్థితులు చూస్తుంటే రాబోయేకాలంలో పత్తికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున రైతులు పత్తి సాగు పెంచే దిశగా అడుగులు వేయాలిజిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలిఇప్పటికే 313 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు121 వ్యవసాయ మార్కెట్ యార్డులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ప్రతిపాదనసీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి మరియు అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్ శాఖ వెంటనే నియమించాలిప్రతి కొనుగోలు కేంద్రం వారానికి ఆరు రోజులు పనిచేసే విధంగా సీసీఐ మేనేజర్లు ప్రణాళిక సిద్దం చేయాలిపత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటుకు ఆదేశాలుజిన్నింగ్ మిల్లర్లు అందరం సీసీఐ టెండర్లలో విధిగా పాల్గొంటామని సానుకూలత వ్యక్తం చేశారుపత్తి నాణ్యత పరీక్షించడానికి మార్కటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రయోగశాల నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలిదీనివల్ల రాబోయే కాలంలో నాణ్యతపరంగా రైతులకు మంచి ధరతో పాటు జిన్నింగ్ మిల్లులకు మేలు జరుగుతుందిసీసీఐ వద్ద జిన్నింగ్ మిల్లులకు ఉన్న సమస్యలను వెంటనే పరిశీలించాలని సీసీఐకి సూచన .. సానుకూలంగా స్పందించిన సీసీఐ
హైదరాబాద్ హాకా భవన్ లో నిర్వహించిన 2022 పత్తి కొనుగోళ్ల సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, సీసీఐ జనరల్ మేనేజర్ అమర్ నాథ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, బ్రాంచ్ మేనేజర్లు బ్రిజేష్ కుమార్ , మహేశ్వర్ రెడ్డి లు , జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి రమేష్, ఇతర అధికారులు