బీదర్ ప్రసంగంలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రస్తావించిన అమిత్ షా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటక లోని బీదర్ జిల్లా బస్వకళ్యాణ్ తాలూకా గోరట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గోరట గ్రామంలో 9 మే 1948 నాడు రజాకార్ల ఊచ కోత, వాళ్లతో పోరాడిన యోధుల గురించి ప్రస్తావిస్తూ, యావత్ దేశం స్వేచ్చా వాయువులు పీలుస్తుంటే హైదరాబాద్ రాష్ట్రం క్రూర నిజాం చేతిలో బందీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ భయపడుతోందని చెప్పారు. అందుకే అందుకే నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గతేడాది అద్భుతంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించినట్లు అమిత్ షా చెప్పారు.

ఈ సంవత్సరం కూడా తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, తెలంగాణ నుంచి వేలాదిగా కార్యకర్తలు ఈ సమావేశానికి తరలి వెళ్లారు. గోరట గ్రామంలోని చారిత్రాత్మక లక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని బండి సంజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆనాడు రజాకార్ల ఊచ కోత ఒక వైపు జరుగుతుంటే, మరోవైపు గ్రామస్థులకు ఆశ్రయం ఇచ్చి, వందలాది మందిని కాపాడిన చారిత్రాత్మక ఇంటిని బండి సంజయ్ సందర్శించారు. ఆనాడు జరిగిన ఘటన, రజాకార్లతో గ్రామస్థులు వీరోచితంగా పోరాడిన గాథ గురించి బండి సంజయ్ స్థానికులను అడిగి తెలుసు కున్నారు.

Leave A Reply

Your email address will not be published.