డిఎస్పిని కలిసిన దళిత నాయకులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: ఆదివారం రోజున దళిత హక్కుల పోరాట సమితి నాయకులు బాన్సువాడ DSP జగన్నాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం అంతటా కూడా దళితులపై శారీరక,మానసిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని బాన్సువాడ డివిజన్ లో ఎక్కడ జరిగిన దళితులకు న్యాయం చేయాలని విన్నవించారు.అనంతరం DSP జగన్నాథ్ రెడ్డి మాట్లాడుతూ సానుకూలంగా స్పందించారు. అనంతరం దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డాక్టర్ అయ్యల సంతోష్,గైని సాయిలు,
బంగారు రవి,గోవర్ధన్,రాయ సాయిలు,బాలకృష్ణ,
బాల్ రాజ్,సాయిలు తదితరులు పాల్గొన్నారు.