బాన్సువాడలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ పట్టణం,బాన్సువాడ రూరల్ మండలం BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనం,ఇతర పార్టీల నుండి BRS పార్టీ లోకి చేరికల కార్యక్రమం సోమవారం బాన్సువాడ లో నిర్వహించనున్నట్లు డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి BRS పార్టీ కామారెడ్డి జిల్లా ఇంచార్జీ యం.ఏల్.సీ దండే విఠల్, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర ఉర్థు అకాడమీ చైర్మన్ శ్రీ ముజీబొద్దీన్ లు ముఖ్య అతిథులుగా  విచేస్తున్నారని అయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ పట్టణం,రూరల్ మండలం పరిధిలోని BRS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమం బాన్సువాడ పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా లో సాయంత్రం 4 గంటలకు. నిర్వహించబడుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.