తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరుగా చైర్మన్ రూమ్కి వెళ్లి పేపర్ లీక్ చేయొచ్చా? అంటూ విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ వేసింది. మరోవైపు ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకుని కూడా విచారిస్తున్నారు. ఇంకోవైపు ఈ కేసులో ఆధారాలు ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సిట్ నోటీసులు అందజేసింది. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు.