మొబైల్ ఫోన్ల ను తెరిచేందుకు సిద్దమయిన ఈడీ

- హాజరుకావాలని కవిత ఈడీ లేఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్సీ కవిత కు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్ల ను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. కవిత తరపున ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లనున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్‌ ద్వారా ఈడీకి పంపారు. తరువాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించారు. నిజానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ టాపిక్‌గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఇప్పటికే మూడు సార్లు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వగా.. ఆమె రెండు సార్లు హాజరయ్యారు. ఆమె ఈడీ విచారణకు హాజరైన ప్రతిసారీ.. కవితను అరెస్ట్ చేస్తారా లేకుంటే.. కవిత సేఫ్‌గా తిరిగి ఇంటికొస్తారా..? అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కవిత ఇవాళ ఈడీకి సమర్పించిన మొబైల్స్ కొత్తవా..? లేకుంటే పాతవా..? అనే దానిపై కూడా చర్చ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ఫోన్ల చుట్టూనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ మొబైల్స్‌లో ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.