‘సెంట్రల్ విస్తా’ ను  ఆకస్మిక తనిఖీ చేసిన ప్రధాని మోదీ  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్ బిల్డింగ్ ‘సెంట్రల్ విస్తా’ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. ప్రధాని మోదీ సర్‌ప్రైజ్ విజిట్‌తో అధికారులు ఆశ్చర్యపోయారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ప్రధాని మోదీ గంటకుపైగా సెంట్రల్ విస్తా ప్రాంతంలో గడిపారని, పలు పనులను తనిఖీ చేశారని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఇక ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ప్రధాని విజిట్‌కు సంబంధించిన ఫొటోల్లో పెద్ద హాల్స్, ఒక లైబ్రరీ, భారీ పార్కింగ్ ప్రదేశం, కమిటీ రూమ్స్ కనిపించాయి. ప్రాంతమంతా కలియదిగిరి ప్రధాని మోదీ నిర్మాణ కార్మికులతో కూడా ముచ్చటించినట్టు ఫొటోల్లో స్పష్టమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.