బీజేపీ, టీఆర్ఎస్ సంయుక్తంగా కాంగ్రెస్ క‌ట్ట‌డి అసాధ్యం .. అందుకే చండూరులో కాంగ్రెస్ కార్యాల‌యానికి నిప్పు పెట్టారు

.. నిందితుల‌పై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకోవాలిః రేవంత్

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్ :
చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం..
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : మునుగోడు నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన దుండగులు.. ఈ రోజు చండూర్ మండలం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేసిన దుండగులు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రత్యర్థులు దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంని తగలబెట్టి ధ్వంసం చేయడం దారుణం. ఈ చర్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ దిమ్మెలు కూల్చినా, పార్టీ కార్యాలయాలు తగులబెటినా.. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. మునుగోడు లో కాంగ్రెస్ కి వస్తున్న ఆధారన చూసి ఓర్వలేక పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారని, టీఅర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి మా క్యాడర్ ని బెదిరిచే కుట్రా చేస్తుందని, బెదిరిస్తే బెదిరేది లేదు అన్నారు. పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళను 24 గంటల్లో అరెస్ట్ చేయలి, లేదంటే ఎస్పీ కార్యాలయం ముందు నేనే ధర్నా చేస్తనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా తెరాస బీజేపీ లకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.