తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు నెలకొన్న ఫ్లోరోసిస్ పరిస్థితులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ అని ఆవేదన చెందారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్పి విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఫ్లోరైడ్ రక్కసిని పారదోలేందుకు ఎంతో శ్రమించారని కేటీఆర్ పేర్కొన్నారు.