ఏపీ మంత్రికి కరోనా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రీజనల్ ఇంచార్జ్‌లు హాజరయ్యారు. ప్రధానంగా గడపగడపకూ మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సమావేశానికి 10మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు.

మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాను కరోనా నిర్థారణ కావడంతో తాను హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. సీఎం సమావేశానికి మంత్రి ధర్మాన దూరంగా ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్లే సీఎం సమావేశానికి హాజరుకాలేదని అనుచరులు చెబుతున్నారు. రాగోలులో ఆసరా పంపిణీ కార్యక్రమానికి ధర్మాన హాజరయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెబుతున్నారు.

ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వంపై మాత్రమే చర్చ ఉంటుందన్నారు మంత్రి రోజా. వాతావరణాన్ని మీడియానే హాట్ హాట్ చేస్తోందని.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, అసెంబ్లీ సమావేశాలతో గడపగడపకు కాస్త గ్యాప్ వచ్చిందన్నారు. నేటి సమావేశంలో ఇదే అంశంపై మరోసారి చర్చించుకుంటామన్నారు. కేబినెట్‌‌లో మార్పు ఉంటుంది అనుకోవడం లేదని..సంవత్సరం కూడా కాకుండా ఆ నిర్ణయం తీసుకోలేరన్నారు. ఇంకా కుదురుకోక ముందే మార్పులు ఉంటాయని తాను భావించడం లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు అందరూ మెరుగ్గానే పనిచేస్తున్నారన్నారు.

సీఎంతో జరిగే సమావేశం సాధారణంగా జరిగే సమీక్ష అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటి వరకూ ఐదారు సమీక్షలు జరిగాయని. ఈ నెల 7 నుంచి నుంచి జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. మంత్రివర్గ మార్పులు ప్రచారం మాత్రమే.. గెలిచే అవకాశాలు లేని వారికి టికెట్ ఇవ్వను అని చాలా సార్లు చెప్పారన్నారు. తనకు గెలిచే అవకాశాలు లేకపోయినా టికెట్ ఇవ్వను అని చెప్తారని.. సత్తెనపల్లిలో కొందరి విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. ముందస్తు ప్రచారం మాత్రమే.. అలాంటి అవసరం లేదన్నారు. ఎమ్మెల్యేలతో భేటీలో ప్రధానంగా గడప, గపడకు మన ప్రభుత్వంతో పాటూ.. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారన్నారు. రెండు వారాల పాటూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని.. ప్రతి ఇంటికి వెళ్లి గత పాలన, జగన్ పాలనలో చేసిన మంచిని వివరించనున్నారు. మొత్తం 5 కోట్లమందికి ఈ మెసేజ్ పంపాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.