ఆర్యవైశ్య పట్టభద్రుల సంఘం అధ్యక్షునిగా కూకుట్ల నవీన్ కుమార్ గుప్త

నిజామాబాద్ ఆర్య వైశ్య పట్టణ సంఘానికి అనుబంధ సంస్థ అయినా ఆర్యవైశ్య పట్టభద్రుల సంఘానికి కూకుట్ల నవీన్ కుమార్ గుప్త అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.  EC సభ్యులు గా ఆయన ప్యానల్ సభ్యులు డా . గందె శ్రీనివాస్ గుప్త, అర్గుల సత్యం , బొందుగుల శ్రావణ్ కుమార్ , అమర్ నాద్ , బాలకృష్ణ, హారికృష్ణ, సాయిచంద్ , శ్రీకర్ ,సాగర్, ఆశ్విని , దివ్య , సాగర్ మరియు ఇతర సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి అమ్మ వారి ఆశీస్సులు మరియు ఆర్యవైశ్య శాశ్వత సభ్యుల అందరి ఆశీస్సుల తో విజయం సాధించమని తమకి ఈ అవకాశం కల్పించి, గెలిపించిన ఈ సంఘానికి సేవా చేసే అదృష్టాన్ని కల్గించారని తమ విజయనికి సహకరించిన అందరికి వారు ధన్య వాదలు తెలిపారు. నూతనంగా ఎనికైన అధ్యక్షుడు కూకట్ల నవీన్ కుమార్ మాట్లాడుతు ప్రతి 6 నెలలకోసారి Reputed companies తో Job Fair నిర్వహిస్తామని,ప్రభుత్య ఉద్యోగాలు మరియు ఇతర పోటీ పరిక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేయిస్తామని,ఉన్నత చదువుల కోసం Counselling సేవలు మరియు Bank Loans Process సేవలు అందిస్తామని ,వ్యాపార రంగంలో ఉత్సాహం ఉండి నూతన వ్యాపారాలు చేయలనుకునే ఆసక్తిగల వైశ్య యువతకు వివిధ బ్యాంకులు మరియు సంస్థల ద్వారా సలహాలు, సూచనలు ఇప్పించడం మరియు సెమినార్లు, కార్యశాలలు నిర్వహిస్తామని,ప్రతి సంవత్సరం SSC, Inter, Degree, PG, EAMCET, JEE and NEET లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వైశ్య విద్యార్థులకు తగిన పారితోషికాలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.