తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఎంతోమంది మున్నాభాయి ఎంబీబీఎస్ ఉన్నట్లున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం నాడు ట్వీట్ చేశారు.తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. వాళ్ల దగ్గర రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటున్నారని పేర్కొన్నారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించి.. ఎన్నికల్లో గెలవడం నేరం కాదా? అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నించారు. వాటిని పరిశీలించి నేరం రుజువైతే అనర్హత వేటు వేస్తారా? అని లోక్సభ స్పీకర్ను ప్రశ్నించారు.