6వ తేదీన హనుమాన్ జయంతిసందర్భంగా మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతిసందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్పరిధిలో మద్యం దుకాణాలనుమూసివేయాలని సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దకాణాలు మూసి ఉంటాయని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు.