నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి
- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అన్ని విషయాల్లో తమ కుటుంబ స్వార్ధం చూసుకుంటున్నారు ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధాన మంత్రి నరేంద్రమోడి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభ లో ప్రదాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రసంగించారు.వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని కాని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యమన్నారు.తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు,అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మా లక్ష్యం..కానీ కొందరు అభివృద్ధిని కావాలని అడ్డుకుంటున్నారురాష్ట్రంలో కుటుంబం పాలన, అవినీతిని పెంచిపోషిస్తున్నారునిజాయితీగా పనిచేసేవారంటే వారికి నచ్చడం లేదుతెలంగాణలో కుటుంబపాలనతో అవినీతి పెరిగిందికొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోందిరాష్ట్రంలో కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారుప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టాంనేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లోనే నిధులు వేస్తున్నామని చెప్పారు.కుటుంబవాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలనుకున్నారువారి నియంత్రణను ఎవరు సవాల్ చేయకూడదనుకుంటారు డిజిటల్ పేమెంట్స్ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా చేశాం రాష్ట్రాభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రాలేదు.దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా?అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి ప్రధాని మోదీకోర్టుకు వెళ్లారు.. అక్కడా వారికి షాక్ తగిలింది..వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్ కూలా లాక్కున్నారు80 కోట్ల మందికి నేడు ఉచితంగా రేషన్ అందిస్తున్నాం
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది: ప్రధాని మోదీఒకే రోజు 13 MMTS రైళ్లను ప్రారంభించాందేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాంహైదరాబాద్- బెంగళూరు అనుసంధాన్ని మెరుగుపరుస్తున్నాంమౌలిక వసతుల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించా మన్నారు.తెలంగాణలో నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాంకల్వకుర్తి- కొల్లాపూర్, మహబూబ్నగర్- చించోలి రోడ్డు విస్తరణ పనులుహైదరాబాద్ రింగ్రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉందిపరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం చేయూత ఇస్తోందిదేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాము. తెలంగాణలో కూడా మెగా టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తాం.ప్రసంగంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రస్తావించిన ప్రధాని,ఇంతవరకూ ఏ ప్రసంగంలోనూ ఆలయం ప్రస్తావన తీసుకురాని మోదీసడన్గా మోదీ ఈ ప్రస్తావన తీసుకురావడంతో సర్వత్రా చర్చ.