బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. పార్టీ నుంచి పొంగులేటి, జూపల్లి సస్పెండ్
ఇక మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అసంపూర్తి పథకాలు, నెరవేరని హామీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. తిండి లేకపోయినా ఫర్వాలేదని.. కానీ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోందన్న జూపల్లి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది. దీంతో పొంగులేటి, జూపల్లి రాజకీయంగా ఏ స్టెప్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అసంతృప్త నేతలను ఏకం చేసి కొత్త పార్టీ పెడతారా ? లేక ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరతారా ? అనేది వేచి చూడాలి.