14 న మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ నెల 14 న మంచిర్యాల లో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారని తెలిపారు. దేశ సంపదను అదానీ, అంబానీ లు కొల్లగొడుతున్నారు. రాహుల్ గాంధీ పై కేంద్రం లోని బీజేపీ నిరంకుషంగా వ్యవహరిస్తోంది. మతం పేరు తో బీజేపీ లూటీ చేస్తోంది. దీన్ని ప్రశ్నించడమే సభ ఉద్దేశ్యం. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం లో భాగంగా నే డ్రామా నడుస్తోంది. ప్రధాని ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను ఎందుకు నిలదీయలేదు. విభజన చట్టంలో కాంగ్రెస్ పొందుపర్చిన హామిలను ప్రశ్నించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లా  మారిందని ఇప్పటి వరకు చర్యలే లేవు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే దమ్ము లేని మీరు విశాఖ స్టీల్ కు టెండర్లు వేస్తారా.. ఎవర్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. లిక్కర్ కేసు లో కవిత వెనక నోటీసులు తీసుకున్న వారు అరెస్ట్ అవుతారు.. ఈమెను చేయరు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకరినొకరు సహకరించుకుంటున్నారు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.