ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా కట్కురి లక్ష్మి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్ 11న నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా కట్కురి లక్ష్మి నియమితులైనారు. ‘బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా  గత 20  సంవత్సరాలుగా పోరాటాలను చేస్తూ బిసి ల సమస్యలపై పోరాటాలు చేస్తున్న కట్కురి లక్ష్మి  సేవలను గుర్తించిన ప్రభుత్వం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ నియమించింది.ఈ సందర్బంగా కట్కురి లక్ష్మి మాట్లాడుతూ తనను కన్వీనర్ గా నియమించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు, అందుకు సహకరించిన రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు కట్కురి లక్ష్మి  కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.