డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా మేడి పాపన్న

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ సమక్షంలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మేడి పాపన్నపిలుపు నిచ్చారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మేడి పాపన్న ను జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా  నియమిస్తూ ఆదేషాలు జారీ చేసింది.తనను ఉత్సవాల కమిటీ చైర్మన్ గా  నియమించిన  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, తన్నీరు హరీష్ రావు , కొప్పుల ఈశ్వర్, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాన ,అందుక సహకరించిన  కమిటీ సభ్యులందరికీ నన్ను రాష్ట్రస్థాయి కన్వీనర్ గా నియమించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చే భారతం దేశం గర్వించేదగ్గ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా చేయాలని కోరుకుంటూ జయంత్ ఉత్సవాల రాష్ట్ర కన్వీనర్ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు జాతీయ అంబేద్కర్ ఫిలాసఫీ అవార్డు గ్రహీత గద్దపాటి భరత్ మాదిగ విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.