వినియోగదారులకు ఉచితంగా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యుత్‌ చౌర్యం, రీడింగ్‌లలో అవకతవకలు అడ్డుకొనేలా గృహాలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు స్మార్ట్‌ మీటర్లుఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా స్థానిక టి.నగర్‌లో 1.42 లక్షల స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే పనులను ప్రయోగాత్మకంగా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వ ఆమోదం తెలిపింది. స్మార్ట్‌ మీటరు ఏర్పాటుకు రూ.6 వేలు వెచ్చించేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి ఎలాంటి నగదు వసూలు చేయమని విద్యుత్‌ బోర్డు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.