రైలుకింద పడి కుటుంబం ఆత్మహత్య యత్నం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జీవితపై విరక్తి చెందిన ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్‌ వద్ద చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు తండ్రి, భార్య, కూతురు ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన రైల్వే పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో తండ్రి పద్మనాభం, భార్య సెల్వి, కుమార్తె జీవితకు గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.