టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్‌ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారన్న అభియోగలపై ఈడీ విచారణ ప్రారంభించింది. కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారినట్లు ఇప్పటికే ఈడికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి సారించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్‌గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్టు గుర్తించింది. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు అందజేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్‌లను కస్టడీలోకి తీసుకొని విచారించనుంది.

Leave A Reply

Your email address will not be published.