అయ్యప్ప ఆలయంలో భక్తులకు అన్నదానం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ పట్టణం లోని అయ్యప్ప ఆలయంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో బుధవారం పడిగెల నారాయణ గుప్తా జ్ఞాపకార్థం వారి కుమారులు మరియు అక్కిపల్లి తరుణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు పద్మ బ్రహ్మారెడ్డి మరియు గుప్తదాత కేరాఫ్ పడిగల రవి గుప్తా లు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో వారు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు,అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం డాత కుటుంబసభ్యులను ఆలయకమిటీ వారు శాలువాతో సన్మానించారు.