ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాఖలో విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న కల్తీకల్లు    

-    కల్తి కల్లు మృతి ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే           -   బిజెపి రాష్ట్ర అద్యక్షులు  బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లువల్ల ఒకరు చనిపోవడంతోపాటు పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుండటం సహించరాని నేరం –బిజెపి రాష్ట్ర అద్యక్షులు  బండి సంజయ్ అన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే నని పేర్కొన్నారు.ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాఖలో విచ్చలవిడిగా కల్తీకల్లు రాజ్యమేలుతుంటే  ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందే – బండి సంజయ్ డిమాండ్ చేసారు.కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపని పక్షంలో బీజేపీ  పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంవల్ల బాణాసంచా నిప్పు రవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంపట్ల ఆయన  తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని,          మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలా సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.       బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా?     తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని,బండి సంజయ్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.