మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని  వీడనున్నాడా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి దాపురించింది. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పార్టీ వీడనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు తాజాగా టీపీసీసీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. దీనిపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల మహేశ్వరరెడ్డి పోరుబాట పాదయాత్రను నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రకు అధిష్టానం బ్రేక్ వేసింది. దీంతో మనస్తాపం చెందిన మహేశ్వరరెడ్డి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు గంటలోపు వివరణ ఇవ్వాలని టీపీసీసీ ఆదేశించింది. దీనిపై మహేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారం పీసీసీకి లేదు.నేను ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌ను. నన్ను నియమించింది సోనియా గాంధీ. నాకు నోటీస్ ఇవ్వాల్సింది కూడా ఏఐసీసీ. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి నియమావళి తెలవదు. నేను పార్టీ మారుతున్నట్లు నిన్నటి నుంచి నా మీద కొన్ని వదంతులు వస్తు న్నాయి. పదే పదే ఇలాంటి ప్రచారం జరగడం బాధాకరం. నాకు షోకాజ్ ఎందుకు ఇచ్చారో వారే సమాధానం చెప్పాలి. నాకు షోకాజ్ ఇచ్చే అర్హత ఉందా ఆలోచించాలి. నా మీద కొందరు కక్ష సాధింపు చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చైర్మన్ కావాలని కోరుకున్న వ్యక్తిని నేను. ఆయన టీపీసీసీ పీసీసీ చైర్మన్ కావడానికి నా వంతు కృషి చేశా. సీనియర్లురేవంత్ మధ్య గ్యాప్ లేకుండా కూడా నేను ప్రయత్నం చేశా’’ అని పేర్కొన్నారు.

ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు..

ఇంకా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే నేను మాట్లాడినా. రేవంత్ వెలుమ కమ్యూనిటీ మీద మాట్లాడినప్పుడు మాత్రమే నేను మాట్లాడలేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం. సీనియర్ల మీటింగ్ నా ఇంట్లో ఉంటే దిగ్విజయ్ కోరిక మేరకు వాయిదా వేశాం. జనరల్ సెక్రటరీని మార్చమని మేము ఎప్పుడూ కోరలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. షోకాజ్ ఇవ్వడం బాధాకరం. ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటా. నేను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామ చేసి వెళతా. నేను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదునా సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనే ది పచ్చి అబద్ధం. అమిత్ షా ను బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదు. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్దం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.