కేంద్ర నిధులు రాకపోతే చీరకొంగుపట్టి బిచ్చం అడుక్కుంటా
- ఢిల్లీకి మాత్రం వెళ్లబోను మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ నిధులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకూ కేంద్ర నిధులు ఇక రాబోవనే ప్రచారం జరుగుతోందని ఆమె చెప్పారు. అంతేకాదు అవసరమైతే చీరకొంగుపట్టి బెంగాళీ మాతల దగ్గర బిచ్చం అడుక్కుంటాను కానీ బిచ్చమెత్తుకునేందుకు ఢిల్లీకి మాత్రం వెళ్లబోనని దీదీ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో మమత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఓ పక్క ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం బీహార్ సీఎం నితీశ్ సారథ్యంలో ఢిల్లీలో సమావేశాలు జరుగుతుండగా కేంద్ర నిధులపై మమత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 చోట్ల గెలిచింది. బీజేపీ 18 చోట్ల గెలిచింది. 2014లో తృణమూల్ 34 సీట్లను గెలుచుకుంది. అయితే 2019కి వచ్చేసరికి పశ్చిమబెంగాల్లో బీజేపీ దూసుకుపోయింది. దాదాపు సగం ఎంపీ సీట్లను దక్కించుకోగలిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, తృణమూల్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయితే మమత పార్టీ 294 స్థానాలకు 215 చోట్ల నెగ్గి స్వీప్ చేసింది. బీజేపీ 70 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షమైంది.పశ్చిమబెంగాల్